తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు తెరిచి ఇంకా 20 రోజులు కూడా కాలేదు. కానీ అప్పుడే ఇందిరానగర్ లో 7 8 9 10 తరగతుల్లో అడ్మిషన్లు కూడా పూర్తి అయిపోయాయి. ఇంకా అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు వస్తుంటే ఈ తరగతుల్లో అడ్మిషన్లు లేవని స్కూల్ బయట ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. ఒక్క ఆరో తరగతిలో మాత్రమే 160 సీట్లు అనేవి ఖాళీలు ఉన్నాయని ప్రధానోపాధ్యాయుడు రామస్వామి చెబుతున్నారు.మొత్తం ఈ 160 సీట్లకు భారీ సంఖ్యలో తల్లిదండ్రులు విద్యార్థులు వచ్చారు. దీంతో ఇక ఆయన వారితో సమావేశమయ్యారు. అలాగే ఈ 160 సీట్లను క్లస్టర్ పరిధిలోని 12 ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు తొలి ప్రాధాన్యం కింద కేటాయిస్తామన్నారు. ఇంకా మిగిలిన సీట్లను మొదట వచ్చినవారికి మొదట ప్రాధాన్యం కింద ఇతరులతో భర్తీ చేస్తామన్నారు.ఇక ఆ స్కూల్లో సీట్లు ఖాళీ లేవని ఉపాధ్యాయులు చెబుతుండటంతో తల్లిదండ్రులు రాజకీయ నేతల నుంచి రికమండేషన్ లెటర్లు కూడా తెచ్చుకుంటున్నారు. అలాగైనా తమ పిల్లలకు సీటు లభిస్తుందని ఆశిస్తున్నారు. అయితే రికమండేషన్ లెటర్ తెచ్చినా కూడా సీట్లు ఖాళీ లేవని అడ్మిషన్లు ఎలా ఇస్తామని స్కూల్ సిబ్బంది చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు తెరిచి ఇంకా 20 రోజులు కూడా కాలేదు. కానీ అప్పుడే ఇందిరానగర్ లో 7 8 9 10 తరగతుల్లో అడ్మిషన్లు కూడా పూర్తి అయిపోయాయి. ఇంకా అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు వస్తుంటే ఈ తరగతుల్లో అడ్మిషన్లు లేవని స్కూల్ బయట ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. ఒక్క ఆరో తరగతిలో మాత్రమే 160 సీట్లు అనేవి ఖాళీలు ఉన్నాయని ప్రధానోపాధ్యాయుడు రామస్వామి చెబుతున్నారు.మొత్తం ఈ 160 సీట్లకు భారీ సంఖ్యలో తల్లిదండ్రులు విద్యార్థులు వచ్చారు. దీంతో ఇక ఆయన వారితో సమావేశమయ్యారు. అలాగే ఈ 160 సీట్లను క్లస్టర్ పరిధిలోని 12 ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు తొలి ప్రాధాన్యం కింద కేటాయిస్తామన్నారు. ఇంకా మిగిలిన సీట్లను మొదట వచ్చినవారికి మొదట ప్రాధాన్యం కింద ఇతరులతో భర్తీ చేస్తామన్నారు.ఇక ఆ స్కూల్లో సీట్లు ఖాళీ లేవని ఉపాధ్యాయులు చెబుతుండటంతో తల్లిదండ్రులు రాజకీయ నేతల నుంచి రికమండేషన్ లెటర్లు కూడా తెచ్చుకుంటున్నారు. అలాగైనా తమ పిల్లలకు సీటు లభిస్తుందని ఆశిస్తున్నారు. అయితే రికమండేషన్ లెటర్ తెచ్చినా కూడా సీట్లు ఖాళీ లేవని అడ్మిషన్లు ఎలా ఇస్తామని స్కూల్ సిబ్బంది చెబుతున్నారు.