ఐపీఎల్ టోర్నీ ప్రస్తుతం ప్రేక్షకులందరికీ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠభరితంగా సాగి పోతుంది. ఈ క్రమంలోనే ఏ  మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది కూడా ఊహకందని విధంగా ఉంది. అయితే ప్రతి సీజన్లో ఎన్నో అంచనాల మధ్య రంగంలోకి దిగి చివరికి లీగ్  దశలోనే సరిపెట్టుకుని విమర్శలు ఎదుర్కొంటుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఎంతో ప్రతిభగల ఆటగాళ్లు ఉన్నప్పటికీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రాణించలేకపోయిన విషయం తెలిసిందే. కానీ ఈ సారి మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బాగా రాణిస్తుంది.



 ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎంతో బలంగా కనిపిస్తున్న విషయం తెలిసిందే.   వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. జట్టులోని ప్రతి ఒక ఆటగాడు కూడా జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ కూడా అద్భుతంగా రాణిస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతో వరుస విజయాలను సొంతం చేసుకుంటూ... పాయింట్ల పట్టికలో వరుసగా మూడవ స్థానంలో కొనసాగుతుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.


 దీంతో అభిమానులు అందరూ ఎంతో సంతోష పడిపోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే నిన్న చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం 146 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఎంతో అలవోకగా టార్గెట్ చేయించింది. అయితే దీనికంతటికీ కారణం జెర్సీ అనే టాక్ వినిపిస్తోంది.  ప్రతి ఏడాది కూడా పర్యావరణాన్ని రక్షించాలి అనే   నినాదంతో ఆకుపచ్చ రంగు జెర్సీ ధరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఆకుపచ్చ రంగు జెర్సీ ధరించి ఆడిన మ్యాచ్ లలో  ఎక్కువగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓటమి చవిచూసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: