దేశం లో కొన్ని వింత సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఒక్క సారిగా షాకైన జనాలు ఆ తరువాత అసలువిషయం తెలిసి ఊపిరిపీల్చుకున్న సంఘటనలు కోకొల్లలు. తాజాగా చదువుకునే విద్యార్థిని చేసిన పని అందరిని విస్మయానికి గురిచేసింది. చదువుకునే అమ్మాయి ఇలా ఎందుకు చేస్తుందని అంత అనుకున్నారు కానీ ఆమె ముందుచూపుని అర్ధం చేసుకున్న పోలీసులు కేవలం మందలించి వదిలిపెట్టారు. తాజాగా ఈ ఘటన మధ్యప్రదేశ్ జబల్పూర్ లో చోటు చేసుకుంది. ఆమె ఇంజినీరింగ్ చదువుతున్న 20 ఏళ్ళ విద్యార్థిని. ప్రతి రోజు ఇంటినుండి కాలేజీకి వెళ్లి ఇంజినీరింగ్ క్లాస్లను పూర్తి చేసుకుని ఇంటికి చేరేది. గత సోమవారం పోలీసులు బస్టాండ్ వద్ద అనుమానంగా కనిపించిన ఆమెను పట్టుకుని తనిఖీ చేశారు .
విద్యార్థినీలు కాలేజీకి వచ్చి వెళ్ళేటప్పుడు దారిలో ఉన్న మాండ్వా బస్తి రౌడీలు మూకలు తమను ఇబ్బంది పెట్టేవారని తెలిపింది. వారినుండి రక్షించుకోవడానికి మాత్రమే వారు ఆ కత్తులను కొనుగోలు చేసినట్లు ఆమె పోలీసుల విచారణలో తెలిపింది . అయితే ప్రాణహాని కలిగించే ఆయుధాలు కలిగివుందన్న కారణం చేత ఆ స్టూడెంట్ ని అరెస్ట్ చేశారు . తరువాత ఆమె తల్లితండ్రులను పిలిపించి ఆమెకు బెయిల్ పై విడుదల చేసారు . అయితే ఆ యువతీ తో పటు ఆ కత్తులను కొన్న ఇతర విద్యార్థినుల కోసం పొలిసు లు గాలిస్తున్నారు