బద్వేల్ :  పోస్టల్ బ్యాలెట్ల నుంచే  వైసిపి ఆధిక్యత ఆరంభం
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఆరంభమైంది. ఎన్నికలఅధికారులు తొలుత పోస్టల్ బ్యాలెట్లను ఒక ట్రేలో చేర్చి లెక్కించారు. అధికారికంగా సమాచారం ప్రకటించ నప్పటికీ ఈ ఎన్నికలలో 235 మంది పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించుకున్నారు. ఈ పోస్టల్ బ్యాలెట్లలో అధికార వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి దాసరి సుధ ఆధిక్యంలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పాణతాల సురేష్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగిన కమలమ్మ వెనుకంజలో ఉన్నట్లు సమాచారం. నాలుగు కౌెంటింగా హాళ్ల లో 27 టెబుళ్లలో కౌంటింగ్ జరుగుతోంది. తోలుత గా కలసపాడు మండలం ఓట్లను కౌంటింగ్ అధికారులు లెక్కిస్తున్నారు. ఈ ఎన్నిక లాంఛన ప్రాయమేనని బరిలో నిలచిన అభ్యర్థుల తాలూకు ఏజెంట్లు సహితం చర్చించుకుంటుండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: