మిర్చి వ్యాపారికి ట్రక్ డ్రైవర్ షాకిచ్చాడు. మిర్చి పంట అమ్మగా వచ్చిన రూ.80 లక్షల నగదుతో డ్రైవర్ పరారయ్యాడు. దీంతో షాక్కు గురైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుంటూరు జిల్లాకు చెందిన ఏడుకొండలు మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. ఇటీవల రెండు ట్రక్కుల్లో మిర్చి లోడును మ హారాష్ట్రలోని షోలాపూర్కు తీసుకెళ్లి అమ్మాడు. దీంతో వచ్చిన రూ.80 లక్షల నగదు తీసుకుని రెండు ట్రక్కులో స్వగ్రామానికి బయలుదేరాడు.
మంగళవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తారం వద్దకు రాగానే ఏడుకొండలు మూత్ర విసర్జన కోసం ఆగాడు. అదే స మయంలో ట్రక్కు డ్రైవర్లు నగదుతో ఉడాయించారు. దీంతో షాకైన బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు తూఫ్రాన్ మండలం ఇస్లాంపూర్ సమీపంలో ఓ ట్రక్కును గుర్తించి సీజ్ చేశారు. నిందితులు మరో ట్రక్కులో పరారైనట్లు గుర్తించి, వారి కోసం గాలింపు చేపట్టారు. అయితే నిందితుడు తెలివి తమ సెల్ఫోన్లను ట్రక్కుల్లో వదిలేసి వెళ్లడంతో వాళ్లను ట్రాక్ చేయడం కష్టంగా మారింది.