ఓ పక్క ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుంటే... దాయాది దేశం పాకిస్థాన్ మాత్రం తన వక్ర బుద్దిని మానుకోవడంలేదు. భారత్ , పాక్ సరిహద్దులో దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా ఆదివారం ఉదయం జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల మరో సారి రెచ్చిపోయారు. భారత జవాన్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు దిగారు.
హంద్వారా సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. వీరిలో కల్నల్ స్థాయి అధికారి కూడా ఉన్నారని సమాచారం. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. కాగా గత 15 రోజులకుగా కశ్మీర్ సెక్టార్లో ఉగ్రవాదులు కాల్పులకు దిగుతున్న విషయం తెలిసిందే. తాజా ఎన్కౌంటర్తో భద్రతా బలగాలు మరింత అప్రమత్తం అయ్యాయి.