బిజూ జనతాదళ్ (బీజేడీ) సీనియర్ నేత, పశ్చిమ ఒడిశా అభివృద్ధి మండలి చైర్మన్, ఆ రాష్ట్ర సిఎం నవీన్ పట్నాయక్ అత్యంత సన్నిహితుడు సుభాష్ చౌహాన్ కన్ను మూశారు. కాలేయ సంబంధిత వ్యాధి తో కొన్ని రోజులుగా బాధ పడుతున్న చౌహాన్ ఈ రోజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 

 

హిందుత్వ నేతగా ఆయనకు పేరుంది. హిందుత్వ సంస్థలు ఆరెస్సెస్, వీహెచ్‌పీతో చౌహాన్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని చెప్తారు. సంఘ్ పరివార్ లో ఆయన కీలక౦గా వ్యవహరించారట. 2019 ఎన్నికలకు ముందు బిజెడిలో చేరినా నవీన్ పట్నాయక్ కి సన్నిహిత నేతగా పేరుంది. ఆయన మృతికి కేంద్ర మంత్రులు, సిఎం పట్నాయక్ నివాళులు అర్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: