అనంతపురం జిల్లా హిందూపురం లో కరోనా వైరస్ క్రమంగా పెరుగుతుంది. దీనితో అక్కడి అధికారులు రాష్ట్ర ప్రభుత్వం హిందూపురం లో ఎప్పటికప్పుడు సాధారణ పరిస్థితులను తీసుకుని రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇక నియోజకవర్గ ఎమ్మెల్యే గా ఉన్న నందమూరి బాలకృష్ణ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

 

నియోజకవర్గంలోని రెవెన్యు అధికారులు సహా వైద్యులతో ఆయన మాట్లాడుతున్నారు. తాజాగా ఆయన ఒక వీడియో విడుదల చేసారు. అందులో... తాను 25 లక్షల విలువ చేసే రెండు వెంటిలెటర్లను దానం చేస్తున్నట్టు చెప్పారు. పరిస్థితులు అన్నీ సద్దుమణిగాక తాను నియోజకవర్గానికి వస్తాను అని ఇప్పుడు హోం క్వారంటైన్ లో ఉన్నాను అని అందుకే రాలేకపోతున్నా అని ఆయన వివరించారు. అలాగే వంద పీపీఈ కిట్స్ కూడా అందిస్తున్నట్టు బాలకృష్ణ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: