దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఎక్కడా కూడా తగ్గే అవకాశాలు ఏ విధంగా చూసినా సరే కనపడటం లేదు అనే చెప్పాలి. దేశ వ్యాప్తంగా కూడా పరిస్థితులు ఇప్పుడు ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే లాక్ డౌన్ ని కొనసాగించాలి అనే అభిప్రాయం అటు ప్రజల్లో ఇటు ప్రభుత్వాల్లో వ్యక్తమవుతుంది. 

 

తెలంగాణా సర్కార్ లాక్ డౌన్ ని కొనసాగించాలి అని కేంద్రాన్ని కోరే అవకాశం ఉంది. తెలంగాణా లో లాక్ డౌన్ పెంపు పై నేడో రేపో కేసీఆర్ సర్కార్ ప్రకటన చేసే సూచనలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాలు ఇప్పుడు కరోనా గుప్పిట్లోనే ఉన్న సంగతి తెలిసిందే. మరి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: