దేశంలో కరోనా వైరస్ తీవ్రత గురించి అందరికి తెలిసిన విషయమే. అది ఏ విధంగా ప్రజలకు నరకం చూపిస్తుందో సామాన్యులు దాని కారణంగా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో అందరికి తెలిసిందే. ఇక ఇది ప్రముఖ నటి ఖుష్బూ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. 

 

ఖుష్బూ సమీప బంధువు ఒకరు కరోనా వైరస్ సోకి ముంబై లో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో ఆమెనే స్వయంగా ప్రకటించారు. ఆమె బంధువుకి అక్కడి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆరోగ్యం క్రమంగా క్షీణించిన నేపధ్యంలో ఆయన మరణించారు అని తెలుస్తుంది. ఖుష్బూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చెప్తూ చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: