రాజ్యసభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు చుక్కలు చూపిస్తున్నారు. వారిని క్యాంపు కి తరలించినా సరే ఒక్కరు కూడా ఇప్పుడు ఆగడం లేదు. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు బిజెపితో టచ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం వారిని ఇప్పటికే క్యాంపు కి తరలించి జాగ్రత్తలు పడుతుంది. 

 

అయినా సరే కొందరు మాత్రం ఆగడం లేదు. మరో నలుగురు ఎమ్మెల్యేలు బిజెపితో టచ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కీలక నేతలు బిజెపితో టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. కాగా ఈ నెల 18న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: