ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రామాల్లో పర్యటించడానికి సిద్దమయ్యారు. ఆయన ఆగస్ట్ నుంచి గ్రామాల్లో పర్యటనకు సిద్దమవుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జగన్ గ్రామాల్లో పర్యటనకు సిద్దమయ్యారు. గ్రామాల్లో ఆయన పర్యటించే విషయం నేడు కేబినేట్ లో కూడా చర్చకు వచ్చింది. 

 

ఇప్పటికే ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్న జగన్ గ్రామాల్లో పర్యటించడం వెనుక కారణం ఏంటీ అనేది స్పష్టత లేదు. ఇక ఆయన నేరుగా ప్రజలతో మాట్లాడటానికే ఇప్పుడు గ్రామాల పర్యటనకు సిద్దమైనట్టు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే షెడ్యుల్ ని కూడా విడుదల చేసే అవకాశం ఉందని వైఎస్ తరహాలో ఆయన గ్రామాల్లో రచ్చ బండ కార్యక్రమాలకు సిద్దమవుతున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: