దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఏ మాత్రం ఆగలేదు. కరోనా కేసులు గత 24 గంటల్లో భారీగా నమోదు అయ్యాయి అని కేంద్రం పేర్కొంది. గత 24 గంటల్లో 18 వేల 522 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 418 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు రెండు లక్షలు దాటాయి. 

 

మొత్తం కేసుల సంఖ్య 5,66,840కు చేరుకుంది. 2,15,125 క్రియాశీల కేసులు ఉన్నాయి దేశంలో. 3,34,822 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. మహారాష్ట్రలో కరోనా కేసులు లక్షా 70 వేలకు చేరువలో ఉండగా ఢిల్లీ, తమిళనాడు లో లక్ష దిశగా వెళ్తున్నాయి కరోనా కేసులు. ఇప్పటి వరకు కరోనా కారణంగా 16,893 మంది మరణించారు అని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: