తిరుమల శ్రీవారి నిధుల విషయంలో ఏదోక విధంగా విమర్శలు రాజకీయ పార్టీలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా ట్విట్టర్ వేదికగా టీటీడీ, ప్రభుత్వం పై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేసారు.  శ్రీవారి నిధులు మళ్ళీoపు పై టీటీడీ వివరణ ఇస్తే బాగుంటుంది అని ఆయన కోరారు. శ్రీవారి నిధులను బాండ్ల రూపంలో పెట్టే దానికి టీటీడీకి అర్హత వుందా...?  అని ఆయన నిలదీశారు.

ప్రభుత్వ ఒత్తిడి మేరకే టీటీడీ శ్రీవారి నిధులను బాండ్ల రూపంలో ప్రభుత్వానికి మళ్లిస్తావుంది అని ఆయన మండిపడ్డారు. ఇది అధికార దుర్వినియోగం అని ఆయన విమర్శించారు.  గత కొంత కాలంగా శ్రీవారి ఆస్తుల విషయంలో కూడా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కూడా ఆయన అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ విమర్శలు చేయడం సంచలనం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd