దుబ్బాక ఉప ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏం  జరుగుతుందో అని అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాస పార్టీ... బిజెపిని టార్గెట్ చేసింది అనే ఆరోపణలు వస్తున్నాయి. నిన్న సాయంత్రం బండి సంజయ్ పై పోలీసులు చేయి కూడా చేసుకున్నారు అనే ఆరోపణలు వచ్చాయి.

ఇక రఘునందన్ రావు టార్గెట్ గా సోదాలు కూడా చేసారు. దీనిపై ఏపీ బిజెపి చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. “తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు , కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ గారిపై జరిగిన చర్య ముమ్మాటికి అధికార దుర్వినియోగమే.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు విచారకరం. ఒక పార్లమెంటు సభ్యునిపట్ల పోలీసుల తీరు ఆక్షేపనీయం” అని సోము తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: