గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఘర్షణ ఎక్కువగా జరుగుతుంది. దీని వలన పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా చర్యలు చేపట్టారు. ఇక ఇదిలా ఉంటే ఘర్షణ ప్రాంతాల మీద పోలీసులు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. ఓల్డ్ మలక్‌ పేట్‌ లో పోలింగ్ రద్దు చేసారు. గుర్తులు తారుమారుతో ఈసీ నిర్ణయం తీసుకుంది.

26వ డివిజన్‌ లో కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తి కొడవలి గుర్తు వచ్చింది. సీపీఐ ఫిర్యాదుతో పోలింగ్ రద్దు చేసిన ఈసీ... రీపోలింగ్ నిర్వహిస్తామని చెప్పింది. ఓల్డ్ మలక్ పేట డివిజన్‌ లోని 69 పోలింగ్ కేంద్రాల్లో రేపు పోలింగ్ నిర్వహిస్తాం అని ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. ఎస్ఈసి రిపోలింగ్ ఉన్నందున గ్రేటర్‌ లో ఎగ్జిట్‌ పోల్స్ నిషేధం ఉంది అని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: