పోస్టల్ బ్యాలెట్ లో బిజెపి వెనుకబడినా సరే తొలి రౌండ్ ఫలితాల్లో మాత్రం బిజెపిని తెరాస సమర్ధవంతంగా అడ్డుకుంది. 25 స్థానాల్లో తెరాస లీడింగ్ లో ఉంది. మజ్లీస్ 7, బిజెపి 12 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఇతర పార్టీలు ఇంకా ఖాతా తెరవలేదు. భారతీ నగర్, చందా నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఓల్డ్ బోయిన్ పల్లి, హైదర్ నగర్, ఆర్సీపురం, పఠాన్ చేరు, హఫీజ్ పేటలో బాలానగర్ లో, చర్లపల్లి, మీర్ పేట, కాప్రా, మీర్ పేట హెచ్ బీ కాలనీలో తెరాస ఆధిక్యంలో ఉంది.

సరూర్ నగర్, బీఎన్ రెడ్డి నగర్ లో, తెరాస ఆధిక్యం కొనసాగిస్తుంది. ఆధిక్యం కూడా చాలా ఎక్కువగా ఉండటంతో వీటిల్లో తెరాస గెలవడం ఖాయమని భావిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ మాత్రం ఇంకా ఖాతా తెరిచిన పరిస్థితి లేదు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: