మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌పై మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. లోకేష్ మునిసిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఒంగోలులో మంత్రి బాలినేనిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. దీనికి కౌంట‌ర్‌గా మంత్రి బాలినేని మాట్లాడుతూ లోకేష్‌ ఒక దరిద్రుడు.. చంద్రబాబు ఒక నీచుడు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని లోకేష్ నాపై మాట్లాడటం సిగ్గుచేట‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌త్తిపాటితో క‌లిసి లోకేష్ పేకాట క్ల‌బ్బులు న‌డిపిన చ‌రిత్ర అంద‌రికి తెలుస‌న్నారు. లోకేష్ గ‌తంలో విదేశాల్లో అమ్మాయిల‌తో క‌లిసి ఎంజాయ్ చేసిన ఫొటోలు చూపిస్తూ లోకేష్‌ రాస‌లీలలు అంద‌రికి తెలిసిన‌వే అని మండిప‌డ్డారు.

ఇక ఒంగోలులో క‌మ్మ వారికి కూడా కార్పొరేట‌ర్ సీట్లు ఇచ్చాన‌ని... టీడీపీ నేత‌లు వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌పై నా వ‌ద్ద‌కు వ‌చ్చినా ప‌రిష్క‌రించాన‌ని చెప్పారు. ఇక ఒంగోలును గ‌తంలోనూ అభివృద్ధి చేశా.. ఇప్పుడు కూడా చేస్తున్నా అన్న బాలినేని తాను వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌ను అంటూనే టీడీపీ నేత దామ‌చ‌ర్ల జ‌నార్థ‌న్‌పై విమ‌ర్శ‌లు చేశారు. దామచర్ల జనార్ధన్‌ బాగోతం అందరికీ తెలుసు... ఆయ‌న అప్పులు ఎగ్గొడితే చాలా మంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నార‌ని బాలినేని తీవ్రంగా ఫైర్ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: