మహారాష్ట్రలో అతిత్వరలోనే కరోనా మూడోవేవ్ ప్రారంభమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మంత్రి ఆదిత్యఠాక్రే  సంచలన ప్రకటన చేశారు. అయితే ఇది రెండోవేవ్ కంటే బలంగా ఉంటుందా? బలహీనంగా ఉంటుందా? అని మాత్రం ఇప్పుడే చెప్ప‌లేన‌న్నారు. కొవిడ్ టీకా ఇప్పటికిప్పుడే పనిచేయ‌కపోయినా, భవిష్యత్తులో ఎంతో ఉపయోగంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. కరోనా దృష్ట్యా తీసుకునే ప్రతి నిర్ణయం కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సూచించిన ప్రకారమే తీసుకుంటున్నామని, ఇందులో  ఏమాత్రం రాజకీయం లేద‌న్నారు. కరోనా కేసుల విషయంలో కొందరు లెక్కలు సరిగ్గా చెప్పడంలేదని, తాము మాత్రం మూడో వేవ్‌ను ఎదుర్కోడానికి సన్నద్ధమవుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం 5 లక్షల పడకలు సిద్ధంగా ఉన్నాయని, అందులో 70 శాతం ఆక్సిజన్‌తో కూడినవేన‌ని, గతంతో పోలిస్తే రోజువారీ కూలీల పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉందని, ఆ విషయంలో తాము కాస్త అనుభవాన్ని కూడా సాధించామని ఆదిత్యఠాక్రే అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: