తెలంగాణా ఆర్టీసీలో జీతాలు ప్రతి నెలా ఆలస్యం అవుతున్నాయి. 16వ తారీఖు వచ్చినా ఉద్యోగులకు మే నెల జీతాలు ఖాతాల్లో జమ కాలేదు. దీంతో ఆర్టీసీ కార్మికులు ఆందోళనలో ఉన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా బస్ డిపో ల ముందు కార్మికుల ఆందోళనకు దిగారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు కార్మికులు. 


ఇక జీతాలు ఆలస్యం కావడంతో ఈఎంఐల చెల్లింపు, ఇతర అవసరాలకు డబ్బు ఇబ్బంది ఎదురవుతున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు. రోజుకు 16 గంటల పాటు పనిచేస్తున్నా జీతాలు సకాలంలో చెల్లించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: