టిడిపి అధినేత చంద్రబాబు మరియు దేవినేని ఉమా పై మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుల రాజకీయాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు రాజ్యసభ స్థానాలను అగ్రవర్ణాలకు తప్ప ఎవరికీ ఇవ్వలేదని విమర్శించారు. బిజెపి ఇచ్చిన కేంద్ర మంత్రి పదవులను కూడా కమ్మ, క్షత్రియ కులాలకు ఇచ్చారనీ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ మాత్రం అలా కాదని అన్ని పదవుల్లో సమన్యాయం పాటించే ముఖ్యమంత్రి అని కొనియాడారు.

అన్ని పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ సీఎం జగన్ అమలు చేస్తున్నారని అన్నారు. సంఘటన సృష్టించి రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటు అని అని వ్యాఖ్యానించారు. బాబు కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మైలవరంలో రాజకీయ లబ్ది కోసం దేవినేని ఉమా అనేక ప్రయత్నాలు చేస్తున్నారని పేర్ని నాని అన్నారు. ఉమా పై కేసులు పెట్టింది ఆయన కారణంగా దెబ్బతిన్న దళితులు మాత్రమేనని అన్నారు. ఐదేళ్లుగా అక్రమ మైనింగ్ చేసి ఇప్పుడు మా ఎమ్మెల్యేకు ఆ పాలించాలని చూస్తున్నారని ఉమా పై మండిపడ్డారు. కానీ చంద్రబాబు బుద్ధి ఏమైనట్టు అని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: