సాయి ధరంతేజ్ యాక్సిడెంట్ గురించి మాట్లాడిన నరేష్ అటు గతంలో ఇలాగే రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోయిన వారి గురించి కూడా ప్రస్తావించడం అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. అంతే కాదు ఎంతో మంది సినీ సెలబ్రిటీలు సైతం నరేష్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు అని చెప్పాలి. ముఖ్యంగా హీరో శ్రీకాంత్.. నరేష్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ వైపు అభిమానులు అందరూ సాయి ధరంతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటుంటే.. నరేష్ ఎందుకు చనిపోయిన వారి గురించి మాట్లాడుతున్నారు అలా మాట్లాడటం సరైనది కాదు అంటూ శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. మరికొన్ని రోజుల్లో మా ఎలక్షన్స్ జరగబోతున్న నేపథ్యంలో ఇలా శ్రీకాంత్ నరేష్ కి కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇకపోతే ఇటీవలే శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాంత్ నువ్వు చేసిన కామెంట్స్ తో ఎంతగానో హర్ట్ అయ్యాను.. ఒకసారి మాట్లాడే ముందు ఆలోచించాలి.. సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదం పై నేను చేసిన వ్యాఖ్యలపై వివరణ కూడా ఇచ్చాను. బైక్ లను చాక్లెట్ లాగా పిల్లలకు ఇవ్వం.. బైక్ ల విషయంలో జాగ్రత్తలు చెప్పడం తప్పేమీ కాదు అంటూ నరేష్ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం నరేష్ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి.