పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ 'భీమ్లా నాయక్'.మలయాళం లో హిట్ అయిన అయ్యప్పనున్ కోషియం అనే సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. యువ దర్శకుడు సాగర్. కె.చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా..త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు.ఇక ఇప్పటికే ఈ సిని మానుండి విడుదల అయిన పవన్, రానా ల టీజర్లు, టైటిల్ సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా సినిమా నుండి రెండవ పాట కూడా విడుదల అయిన విషయం తెలిసిందే.

థమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో 'అంత ఇష్టం ఎందయ్యా' అంటూ సాగే ఈ పాటను ప్రముఖ గాయని చిత్ర ఆలపించారు.అయితే భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ తో పోల్చితే ఈ రెండవ పాటకు అంతగా రెస్పాన్స్ రాలేదు.ముఖ్యంగా ఈ పాట పవన్ ఫ్యాన్స్ ని  పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఎందుకంటే ఈ పాటకి ఆశించిన స్థాయిలో వ్యూస్ కూడా రాలేదు.అయితే కొంత మంది అభిమానులు మాత్రం స్లోగా ఈ పాట ఆడియన్స్ మెప్పు పొందే అవకాశం ఉందని అంటున్నారు.ఇక ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.ఇక ఈ పాటని పవన్, నిత్యా మీనన్ లపై తెరకెక్కించారు.ఇక ఇప్పటికే ఈ సినిమాకి రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

ఇక పవన్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు.ఇక ఈ సినిమా మలయాళ రీమేక్ అయినా కూడా మన తెలుగు నేటివిటీకీ తగినట్లుగా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. ఇక ఆయన సరసన నిత్యా మీనన్ నటిస్తుండగా.. దగ్గుబాటి రానా కి జోడిగా సంయుక్తా మీనన్ కనిపించనుంది.ఇక వకీల్ సాబ్ వంటి భారీ హిట్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమా కోసం అభిమానులతో పాటూ సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: