‘రంగస్థలం’ మూవీలో రంగమ్మత్త పాత్ర అనసూయ కు ఫిలిం ఫేర్ అవార్డు తెచ్చిపెట్టింది. ఫ్యాషన్ ఫోటో షూట్స్ కు పోజులు ఇస్తూ నిరంతరం అనేకమంది దగ్గర నుండి విమర్శలు ఎదుర్కునే అనసూయలో ఉన్న టాలెంట్ ను ఒకేసారి రంగమ్మత్త పాత్ర బయటపెట్టడంతో విమర్శకులు కూడ ఆమె పై ప్రశంసలు కురిపించారు.


ఆతరువాత అనసూయకు ఎన్నో సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా తన దృష్టి అంతా బుల్లితెర షోల పైనే పెడుతూ వస్తోంది. లేటెస్ట్ గా ఆమె ‘పుష్ప’ మూవీలో నటిస్తున్న దాక్షాయణి పాత్రకు సంబంధించిన లుక్ కు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో ఆ ఫోటోలు క్షణాలలో మీడియాలో వైరల్ గా మారిపోయాయి. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్న అనసూయ నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకొని ఒంటి నిండా నగలు ధరించి చాల గంభీరంగా కనిపిస్తోంది.


ఆమె పాత్ర చాల భయంకరంగా ఉంటుందని అంతేకాకుండా అహంకారంతో కనిపించే ఆపాత్ర ‘పుష్ప’ మూవీకి హైలెట్ అంటున్నారు. గతంలో కూడా అనసూయ ‘క్షణం’ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు ‘పుష్ప’ మూవీలో ఆమె నటిస్తున్న దాక్షాయణి పాత్ర ఆమెకు పేరు తెచ్చిపెడితే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి ఆమె లేడీ విలన్ గా మారి తమిళ వరలక్ష్మి కి గట్టిపోటీ ఇచ్చే ఆస్కారం ఉంది. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి అల్లు అర్జున్ రష్మిక అనసూయలు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్న పరిస్థితులలో సుకుమార్ చేతిలో వీరి లుక్ పూర్తిగా మారిపోయింది అని అనిపిస్తోంది.


గంధపు చెక్కల అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందుతున్న ‘పుష్ప’ మొదటి భాగం డిసెంబర్ లో విడుదల అవుతున్న పరిస్థితులలో ఈసినిమాతో తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లకు పూర్వ వైభవం వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశిస్తున్నాయి. క్రిస్మస్ సీజన్ లో రాబోతున్న ఈమూవీ రికార్డుల పై బన్నీ చాల ఆశలు పెట్టుకున్నాడు..




మరింత సమాచారం తెలుసుకోండి: