టాలీవుడ్ లో అందంతో పాటు తన అభినయంతో కూడా ఎందరో అభిమానుల మనసు దోచుకున్న కథానాయికల్లో అనుష్క శెట్టి ముందు వరుసలో ఉంటారు అని చెప్పవచ్చు. నాటి సావిత్రి, సౌందర్యాలు తరువాత ఆ విధంగా ఎక్కువగా కథ, కథనాలు, తన పాత్రకు ప్రాధాన్యత కలిగిన చిత్రాలనే ఎంపిక చేసుకుంటూ మంచి కెరీర్ తో కొనసాగుతున్న అనుష్క ఫస్ట్ టైం పూరి జగన్నాథ్ తీసిన సూపర్ మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయ్యారు. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.

అనంతరం వచ్చిన అవకాశాలతో ముందుకు సాగిన అనుష్కకు ఆ తరువాత కోడిరామకృష్ణ తీసిన అరుంధతి సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి కెరీర్ పరంగా ఆమెకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఇక అక్కడి నుండి దూసుకెళ్లిన అనుష్క ఇటీవల బాహుబలి సినిమాలో దేవసేన పాత్రతో మరింతగా అందరి మన్ననలు అందుకున్నారు. అయితే బాహుబలి తరువాత భాగమతి సినిమా చేసి మరొక విజయం అందుకున్న అనుష్క, 2020 చివర్లో నిశ్శబ్దం మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కాగా ఈ మూవీ మాత్రం పెద్దగా సక్సెస్ కాలేదు.

ఇక అక్కడి నుండి ఒక్క సినిమా కూడా చేయని అనుష్క లేటెస్ట్ గా తన నెక్స్ట్ మూవీని నవీన్ పోలిశెట్టి తో చేస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి ఈ 2021 వ సంవత్సరం అనుష్క ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి తాను అనుకున్న సరైన స్క్రిప్ట్ దొరక్కపోవడమే అని అంటున్నారట ఆమె సన్నిహితులు. నిశ్శబ్దంతో అభిమానులని నిరాశపరిచిన తాను, ఎలాగైనా మంచి హిట్ కొట్టి వారిని ఖుషి చేయాలనే ఆలోచనతోనే మంచి స్క్రిప్ట్ కోసం ఎంతో వెయిట్ చేసారని, ప్రస్తుతం నవీన్ తో మహేష్ బాబు అనే యువ దర్శకుడు తీస్తున్న సినిమాతో తనకు మంచి పేరు వస్తుందని అనుష్క భావిస్తున్నారట. ఆ విధంగా ఈ ఏడాది అనుష్క నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. అలానే త్వరలో ఆమె నుండి మరొక భారీ సినిమా అనౌన్స్ మెంట్ కూడా రానుందనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: