ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల పంచాయితీ సర్వత్రా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. టికెట్ల రేట్ల తగ్గింపు విషయంలో ఇండస్ట్రీ మొత్తం ఏపీ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న అంశం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఇదే విషయంపై బహిరంగగా తన అసంతృప్తిని తెలియ చేసిన హీరో నానీని టార్గెట్ చేశారు ఏపి మంత్రులు. ఆంధ్ర ప్రదేశ్ లో థియేటర్ల వసూళ్ల కంటే కూడా కిరాణా కొట్టుల కలెక్షన్లు బాగున్నాయి అన్నారు నాని, దాంతో ఏపి మంత్రులు వరుసగా హీరో నానిపై విమర్శలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ నటి, వైసిపి నేత రోజా హీరో నానిపై కౌంటర్ విసిరారు. ఏపీ ప్రభుత్వంపై నాని ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం నిజంగా విచరించతగ్గ అంశం.  

ఏపీ సినిమా థియేటర్స్ లో రాని కలెక్షన్లు కిరాణా కొట్టులో వస్తున్నాయి అని తెలిసినప్పుడు నువ్వు సినిమాలు తీయడం వేస్టు కదా ఆపేసి కిరాణా కొట్టు పెట్టుకోవడం మంచిది కదా అంటూ హీరో నానిపై సెటైర్ వేశారు రోజా. ఆలోచన అవసరం..ఇలాంటి  మాటలు వలన ఇండస్ట్రీకి లాభం ఏమో కానీ నష్టం మాత్రం ఎక్కువే. కాబట్టి పరిస్థితులకు తగ్గట్టు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నట్లయితే చిన్న, పెద్ద సినిమాలకు కూడా ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని రోజా ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే నాని ఏ సందర్భంలో ఈ మాటలు మాట్లాడాడో అన్న విషయం ఏమీ ఆలోచించకుండా ఎమ్మెల్యే రోజా విమర్శించిన తీరు పట్ల వ్యతిరేకత కలుగుతోంది. ఇండస్ట్రీలో లోపల లోపల ఎన్ని సమస్యలున్నా ఇండస్ట్రీకి సమస్య వస్తే అంతా ఒకటవుతారు. దీనిపై తర్వాత నానీ కానీ, సినిమా ఇండస్ట్రీ కానీ ఏమీ మాట్లాడకపోయినా నానీ అభిమానులు మరియు ప్రజలు ఈ విషయం గురించి కోరుగా చర్చించుకుంటున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల రేట్ల పోరు ఇప్పుడప్పుడే ఒక కొలిక్కి వచ్చేలా లేదు ఈ విషయంపై ప్రభుత్వం చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో అన్న అంశం ఇపుడు ప్రశ్నార్ధకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: