ఇక లేటెస్ట్ గా బాలయ్యతో ముచ్చటగా మూడోసారి బోయపాటి తీసిన అఖండ మూవీ కూడా మంచి సక్సెస్ కొట్టడంతో అందరిలో ఆయన నెక్స్ట్ మూవీ పై ఆసక్తి నెలకొంది. ఇక అసలు విషయంలోకి వెళితే త్వరలో బోయపాటి ఒక భారీ వెంచర్ ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈసారి ఏకంగా బాలయ్య, అల్లు అర్జున్ లతో బోయపాటి భారీ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ మూవీ తీయనున్నారని, దానికి సంబంధించి ప్రస్తుతం కథ, స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న బోయపాటి దానిని పక్కాగా ఏప్రిల్ లో ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారట. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ మూవీని ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారని సమాచారం.
ఈ సినిమాలో అటు బాలయ్య పాత్ర, ఇటు అల్లు అర్జున్ పాత్ర రెండూ కూడా ఎంతో అదిరిపోయేలా బోయపాటి ఎంతో జాగ్రత్తగా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని వినికిడి. మరోవైపు ఇటీవల అఖండ సక్సెస్ మీట్ లో భామగా బోయపాటి మాట్లాడుతూ నా తదుపరి సినిమా గురించి అందరూ అడుగుతున్నారు, వెయిట్ చేయండి ఈసారి ఏదైనా జరగొచ్చు అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఆ మాటలోని అంతరార్ధం ఇదన్నమాట, ఒకవేళ బోయపాటి అల్లుల్ అర్జున్, బాలయ్య తో సిద్ధం చేస్తున్న స్క్రిప్ట్ కనుక వర్కౌట్ అయి రేపు తెరకెక్కిన తరువాత పెద్ద సక్సెస్ కొడితే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రచ్చే రచ్చే అంటున్నారు విశ్లేషకులు.