తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు దూకుడు మీద ఉన్నాడు..వరుస హిట్ సినిమాల తో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. సర్కారు వారి పాట తర్వాత మహేష్ ఎ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడు అనే విషయం పై ప్రిన్స్ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో పాన్ ఇండియా సినిమాను సెట్స్ మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా మొదలయ్యాయి.



ఆర్ఆర్ఆర్ తర్వాత విదేశాలకు వెళ్ళి బాగా రిలాక్స్ అయి వచ్చిన జక్కన్న వచ్చీ రాగానే మహేశ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో చర్చలకు దిగారు. ఇద్దరూ కలిసి మహేశ్ సినిమా కథపై చర్చలు జరుపుతున్నారు. ఇప్పటివరకు రాజమౌళి కెరీర్‌లో ఫ్లాప్ అంటే ఏంటో చూడని జక్కన్న హీరోలకు పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ తీసుకొచ్చిపెట్టారు.ప్రభాస్ ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్‌తో బాక్సాఫీస్ వద్ద వేల కోట్లు కొల్లగొడుతున్నాడంటే దానికి కారణం ఆయనే. ఆర్ఆర్ఆర్ తర్వాత హీరోలు చరణ్, ఎన్.టి.ఆర్ లైనప్ కూడా భారీ ప్రాజెక్ట్‌తోనే సాగుతుంది.


 
ఇక ఇప్పుడు గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్‌ను మహేశ్ బాబుకు తెచ్చేందుకు జక్కన్న బృందం రెడీ అవుతోంది. పదేళ్ళ నుంచి అదిగో ఇదిగో అంటూ హోల్డ్‌లో ఉన్న మహేశ్ – రాజమౌళిల సినిమా ఎట్టకేలకు ప్రముఖ నిర్మాత డా కె ఎల్ నారాయణ సెట్స్‌పైకి తెస్తున్నారు. ఒకవేళ ప్రీ ప్రొడక్షన్స్ వర్క్‌తో సమయం సరిపోకపోతే, వచ్చే ఏడాది ప్రారంభంలో అయినా షూటింగ్ మొదలనుంది.ఎలా గైన సరే ఈ సినిమాను 2024 లో రిలీజ్ చెయ్యాలని గట్టి ప్లాను లో ఉన్నారు..హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దాకపూర్‌ను జక్కన్న టీమ్ పరిశీలిస్తుందట. సాహో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రద్ద, ఇక్కడ బాగానే జనాలను ఆకట్టుకుంది. కానీ, సాహో ఫ్లాప్ కావడంతో ఇక్కడ మేకర్స్ పట్టించుకోలేదు. అయితే, రాజమౌళి చేసేదిమహేశ్ తో పాన్ ఇండియన్ సినిమా. పైగా అనుకున్న కథకు శ్రద్దా అయితే మహేశ్ పక్కన సరిగ్గా సూటవుతుందని ఆమెను తీసుకుందామను కుంటున్నారట.కానీ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో వద్దు అని కామెంట్లు పెడుతున్నారు... మరి చివరికి ఎవరూ హీరోయిన్ గా సెట్ అవుతా రో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: