మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస మూవీ లలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . అందులో భాగంగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి , మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో కూడా హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ తమిళ్ లో సూపర్ హిట్ విజయం సాధించిన  వేదళం మూవీ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది . సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది . ఈ మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా , మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా కనిపించబోతోంది . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది . 

అసలు విషయం లోకి వెళితే ... ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల 51 నిమిషాలకు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ నుండి  ఒక పోస్టర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది . మరి ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేయబోయే పోస్టర్ ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే మిల్కీ బ్యూటీ తమన్నా ఇది వరకే మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి మూవీ లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించింది.భోళా శంకర్ మూవీ లో చిరంజీవి సరసన తమన్నా రెండవ సారి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇది వరకే కొన్ని పోస్టర్ లను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: