బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి తాజాగా భారీ అంచనాల నడుమ విడుదల అయిన మూవీ బ్రహ్మాస్త్రం. ఈ మూవీ లో బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న రన్బీర్ కపూర్ హీరోగా నటించిన , ఆలియా భట్మూవీ లో రన్బీర్ కపూర్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా , అమితా బచ్చన్ , నాగార్జున , మౌని రాయి ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. 

మూవీ ని 2 D మరియు 3 D వర్షన్ లలో విడుదల చేశారు. ఈ మూవీ ని హిందీ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేశారు. తెలుగు లో ఈ మూవీ ని దర్శక ధీరుడు రాజమౌళి సమర్పించాడు. బ్రహ్మాస్త్రం మూవీ నిన్న అనగా సెప్టెంబర్ 9 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్న నేపథ్యంలో ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్ లు దక్కాయి.

మొదటి రోజు బ్రహ్మాస్త్రం మూవీ ప్రపంచ వ్యాప్తంగా 75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసినట్లుగా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. మొదటి రోజే 75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వ్యాప్తంగా వసూలు చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో బ్రహ్మాస్త్రం మూవీ బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్ లను అందుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే రన్బీర్ కపూర్ తాజాగా  షంషేరా అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: