పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఎన్నో భారీ అంచనాలతో చేసిన "అజ్ఞాతవాసి" సినిమా డిజాస్టర్ అయిన తరువాత "అరవింద సమేత వీర రాఘవ", "అల వైకుంఠపురంలో" సినిమాలతో త్రివిక్రమ్ తన ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు చేర్చుకున్న సంగతి తెలిసిందే.అయితే కొన్ని కారణాల వల్ల వీటి తరువాత త్రివిక్రమ్ కు రెండేళ్ల గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్న త్రివిక్రమ్సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత బన్నీతో ఒక సినిమాను, రానాతో ఒక సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.గుణశేఖర్ రానా కాంబినేషన్ లో హిరణ్యకశిప టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కనుందని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ కాంబినేషన్ లో సినిమా వర్కౌట్ కాలేదు. అయితే ఇదే టైటిల్ తో త్రివిక్రమ్ సొంతంగా తయారు చేసిన కథతో రానా హీరోగా సినిమా తెరకెక్కనుందని సమాచారం తెలుస్తుంది. పురాణాలపై పట్టు ఉన్న త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమాతో సక్సెస్ సాధించాలంటే మైథలాజికల్ సినిమాలే కరెక్ట్ అనే భావనను కలిగి ఉన్నారు.పాన్ ఇండియా మూవీగా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమాను తెరకెక్కించాలని ఆయన భావిస్తున్నారు.


భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా రాబోయే రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. త్రివిక్రమ్ ఇప్పటికే హిరణ్యకశిప ప్రాజెక్ట్ పై కొంతమేర వర్క్ చేశారని తెలుస్తోంది. త్రివిక్రమ్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాను తెరకెక్కించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.ఇప్పటికే హారిక హాసిని నిర్మాతలు హిరణ్యకశిప టైటిల్ ను రిజిష్టర్ చేయించారని గుణశేఖర్ నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా సెటిల్ మెంట్లు కూడా చేసేశారని సమాచారం అందుతోంది. 2024 చివర్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ అయితే ఉంది. బాహుబలి సినిమాకి ధీటుగా త్రివిక్రమ్సినిమా తెరకెక్కిస్తాడట.భీమ్లా నాయక్ సినిమాలో నటించడం రానాకు ఈ విధంగా ప్లస్ అయింది. విజువల్ వండర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: