వివాదాస్పద టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ 3 తెలుగులో ఏడో వారం ఎలిమినేషన్ షాక్ ఇచ్చింది. ఈవారం యాంకర్ శిల్పా చక్రవర్తి వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా ఆరు వారాల నుండి నామినేషన్ తప్పించుకున్న అలీ రెజా ఎట్టకేలకు ఏడో వారంలో నామినేషన్ కు వచ్చాడు. మహేష్ విట్టా , వితిక , బాబా భాస్కర్ , వరుణ్ అతడిని నామినేట్ చేశారు. అలీ తో పాటు మహేష్ ,రవి కృష్ణ , అలీ రెజా , రాహుల్ ,శ్రీ ముఖి ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. ఇక వీరిలో మహేష్ లేదా , రాహుల్ ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు. అయితే ఊహించని విధంగా అలీ రెజా ను హౌస్ నుండి బయటికి పంపించరాని సమాచారం వస్తుంది. ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ల లో ఒకడి గా కొనసాగుతున్న అలీ అనూహ్యంగా ఎలిమినేట్ అవ్వడం ఇప్పుడు అందరిని ఆశ్యర్య పరిచింది.
అలీ ఎలిమినేట్ అవ్వడానికి అతని దురుసు ప్రవర్తనే కారణం అని తెలుస్తుంది. ఇక గత వారం రమ్యకృష్ణ హోస్ట్ గా వచ్చి ఎలిమినేషన్ లో వున్నా వారందర్ని సేవ్ చేసింది. బర్త్ డే సెలబ్రేషన్ లో భాగంగా ఫారెన్ ట్రిప్ లో ఉండడం వల్ల నాగార్జున ఆ వారం హోస్టింగ్ చేయలేకపోయారు. కాగా తన ప్లేస్ లో వచ్చిన హోస్ట్ గా రమ్యకృష్ణ కూడా అదరగొట్టింది. అయితే ఈ వారం మాత్రం మళ్ళీ నాగార్జునే హోస్ట్ గా రానున్నారు. ఇప్పటివరకు బిగ్ బాస్ 3 సీజన్ లో మొదటివారం హేమ , రెండో వారం జాఫర్ , మూడో వారం వైల్డ్ కార్డు ఎంట్రీ తమన్నా సింహాద్రి , నాలుగోవారం రోహిణి ,ఐదవ వారం అషు రెడ్డి ఎలిమినేట్ అయ్యారు.