టాలీవుడ్ సినిమా పరిశ్రమకు రవితేజ హీరోగా తెరకెక్కిన నీకోసం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీను వైట్ల, ఆ సినిమాతో మంచి విజయాన్నే అందుకున్నారు. ఆ తరువాత సొంతం సినిమాతో మరొక మంచి విజయాన్ని అందుకున్న శ్రీను, ఆపై రవితేజతో వెంకీ, దుబాయ్ శ్రీను, అలానే వెంకటేష్ తో నమో వెంకటేశ, నాగార్జున తో కింగ్, మహేష్ తో దూకుడు సినిమాలు తీసి మంచి హిట్స్ అందుకున్నారు. 

 

అయితే ఆ తరువాత మహేష్ తో కలిసి ఆయన తీసిన ఆగడు ఫ్లాప్ కావడం, ఇక అక్కడి నుండి రామ్ చరణ్ తో తీసిన బ్రూస్ లీ, ఆపై వరుణ్ తేజ్ తో మిస్టర్, అలానే ఇటీవల రవితేజ తో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు కూడా ఘోర పరాజయాలు అందుకుని శ్రీనుకు కెరీర్ పరంగా బాగా దెబ్బేసాయి. ఇక ఆయన సినిమాలు పరిశీలిస్తే, ఎక్కువగా కొంత సినిమా నడిచిన తరువాత విలన్ వద్దకు చేరిన హీరో, మెల్లగా అతడి పరిస్థితులను తాను ఆధీనంలోకి తెచ్చుకుని, ఆపై ఆ విలన్ ని బకరాని చేసి అంతమొందించడం కనపడుతుంది. ఇక ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నభ నటేష్, అను ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా సినిమా కూడా కొంతవరకు శ్రీను వైట్ల మార్క్ ట్రీట్మెంట్ తో సాగుతుందని టాలీవుడ్ వర్గాల టాక్. 

 

ఇందులో కూడా ఇద్దరు విలన్ల దగ్గర తిష్టేసే హీరో, ఆపై వారిద్దరినీ తన తెలివితేటలతో బకరాలను చేస్తాడని, అయితే మంచి ఆకట్టుకునే స్క్రీన్ ప్లే ని ఈ సినిమా కోసం దర్శకడు శ్రీనివాస్ రాసుకున్నారని అంటున్నారు. ఇక కెరీర్ పరంగా ఇటీవల సరైన సక్సెస్ లేని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఈ సినిమా మంచి బ్రేక్ ని ఇస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో విలన్లుగా ప్రకాష్ రాజ్, సోను సూద్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. మే లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనపడుతోంది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: