పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ సీనియర్ హీరో గా, జనసేన పార్టీ అధినేతగా దూసుకెళ్తున్నారు. మన జీవితం మొత్తం ప్రజల సంక్షేమం కొరకే ఆర్పిస్తానని మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆర్థిక సమస్యల వలన తానిచ్చిన మాటనే జవదాటల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా రెండు సినిమాలకి ఒప్పుకొని పవన్ కళ్యాణ్ మళ్లీ సినీ పరిశ్రమలో అడుగు పెట్టాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఘనవిజయం సాధించిన అమితాబచ్చన్ సినిమా పింక్ రీమేక్ ని వకీల్ సాబ్ గా తెలుగులో తెరకెక్కిస్తుండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. వ్యభిచార గృహాల్లో చిక్కుకుపోయిన ముగ్గురు యువతులను రక్షించే లాయర్ కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లు సమాచారం.


ఈ సినిమాలో వ్యభిచార గృహాల్లో చిక్కుకుపోయిన ముగ్గురు యువతుల పాత్రలలో నివేదా థామస్, అంజలి, అనన్య నటిస్తున్నారు. బాలీవుడ్ మెగా హీరో అమితాబచ్చన్, తమిళ్ యాక్షన్ హీరో వేర్వేరుగా పింక్ కథ సినిమాల్లో అద్భుతంగా నటించి ప్రతి ఒక్కరి ప్రశంసలను అందుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రని ఎలా పోషిస్తారు అనేది ఆసక్తికర అంశంగా మారింది. ప్రస్తుతం భారత దేశమంతటా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ... వకీల్ సాబ్ చిత్రం మే 15న విడుదల కొరకై ముహూర్తం పెట్టుకున్నప్పటికీ... సినిమా రిలీజ్ కాస్త వాయిదా అయ్యేటట్టు తెలుస్తోంది.


ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ తదుపరి సినిమా గురించి ఒక ఇంటరెస్టింగు అప్డేట్ లీక్ అయ్యి నెట్టింట పెద్ద దుమారమే రేపుతోంది. ఇంతకీ ఆ ఇంటరెస్టింగ్ అప్డేట్ ఏంటంటే... లాక్ డౌన్ పూర్తిగా ఎత్తి వేసిన వెంటనే పవన్ కళ్యాణ్ ఫైట్ సన్నివేశంలో నటించనున్నాడట. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ ఓ ఫైట్ చిత్రంలో నటించడం, మళ్లీ ఆ ఫైట్ చాలా ఇంటెన్స్ గా రూపొందించడం తన అభిమానులకు ఒక పెద్ద శుభవార్త గా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ సినిమాలు సినిమాలు తీస్తే చూడడానికి కోట్ల మంది అభిమానులు ఇప్పటికీ ఉన్నపటికీ ఆయన మాత్రం సినీ కెరీర్ కి దూరం అవుతున్నానని చెప్పడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: