టాలీవుడ్ లో లక్కీ హీరో అంటే వెంటనే గుర్తుకు వస్తాడు విజయ్ దేవరకొండ. సందీప్ వంగా దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ.. ఆ తరవాత ‘గీతగోవిందం’ సినిమాతో తన మార్కెట్ను అమాంతం పెంచేశారు. ఆ తర్వాత టాక్సీవాలా తో మరో ఘన విజయం అందుకున్నాడు. ఇక టెంపర్ సినిమా తర్వాత వరుస ఫ్లాపులు అందుకుంటున్న పూరి జగన్నాథ్ గత ఏడాది రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’ తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ షేక్ చేసింది.. కలెక్షన్లు కూడా బాగా వచ్చాయి. ప్రస్తుతం పూరి జగన్నాథర్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ (వర్కింగ్ టైటిల్) తెరకెక్కిస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ.
ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండను హిందీ ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, ఈ చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్లోనే బడ్జెట్ పరంగా భారీ చిత్రం కాబోతోందని సమాచారం. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్తో కలిసి పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ వర్షన్ను కరణ్ జోహార్ సమర్పిస్తున్నారు. ఈ మద్య కరోనా ఎఫెక్ట్ తో ఈ మూవీ షూటింగ్ అగిపోయింది. దాదాపు ముంబాయిలోని ధారావీ ప్రాంతంలో కొంత షూట్ చేశారు.
కానీ అక్కడ పరిస్థితి బాగా లేదు. లాక్ డౌన్ అక్కడ ఎప్పుడు ఎత్తేస్తారో తెలియని పరిస్థితి. లాక్ డౌన్ తొలగించినా అక్కడ ధైర్యంగా షూటింగు చేసే పరిస్థితి ఉండకపోవచ్చని అంటున్నారు.ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో సెట్స్ వేసి షూటింగ్ లాగించేయడమే కరెక్ట్ అనే నిర్ణయానికి పూరి వచ్చాడని చెబుతున్నారు. అందుకే ఆయన హైదరాబాద్ లోనే ప్రత్యేకమైన సెట్స్ లో మూవీ పూర్తి చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.