రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తున్న ఈ సినిమాపై అంచనాలు మరో రేంజ్ లో ఉన్నాయి. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ కి విశేషమైన స్పందన వచ్చినప్పటి నుండి ఆ అంచనాలు మరింత పెరిగాయి. నిజ జీవితంలో అసలు కలుసుకోలేని రెండు పాత్రలని ఏ విధంగా కలుపుతాడన్న ఆసక్తి జనాల్లో విపరీతంగా ఉంది.

 

 

కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కలుసుకున్నట్లు ఆధారాలు లేవు. కానీ 1920 ప్రాంతంలో వారిద్దరూ ఇళ్ళ నుండి బయటకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఎక్కడికి వెళ్లారనేది ఎవ్వరికీ తెలియదు. ఆ పాయింట్ ని తీసుకున్న రాజమౌళి, వారిద్దరూ కలుసుకుంటే ఎలా ఉంటుందనేది చూపించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడోగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుంది. ఎన్టీఆర్ సరసన బ్రిటన్ భామ ఒలివియా మోరిస్ కనిపించనుంది.

 

 

అలాగే ఒక ప్రత్యేక పాత్రలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కనిపించనున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఇద్దరూ అజయ్ దేవగణ్ సమక్షంలోనే కలుసుకుంటారని అంటున్నారు. అయితే ఇక్కడే ఈ సినిమాలో నటించే మరో తార గురించి సమాచారం బయటకి వచ్చింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని, పెళ్ళి చేసుకున్నాక కొంతకాలం గ్యాప్ తీసుకున్న హాట్ భామ శ్రియ కూడా నటిస్తుందని సమాచారం.

 

 

ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో అజయ్ దేవగణ్ సరసన శ్రియ నటిస్తుందట. ఈ విషయాన్ని శ్రియ, సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది. అధికారికంగా రివీల్ చేయకపోయినప్పటికీ శ్రియ కన్ఫర్మ్ చేసేసింది. మరి ఈ విషయమై రాజమౌళి ఎలా స్పందిస్తాడో..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: