తెలుగు చిత్ర పరిశ్రమలో సూటింగ్స్ నిలిచిపోయి ఇప్పటికే దాదాపు 3నెలలు కావస్తుంది. అయితే ఇటీవల కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్స్ నిర్వహించుకోవచ్చని పర్మిషన్స్ ఇచ్చారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో మళ్ళీ షూటింగ్స్ మొదలయ్యాయి. ఇప్పటికే రవి బాబు సినిమా, మెగా మేళ్ళౌడి సినిమా మొదలు పెట్టారు. అంతేకాదు బుల్లితెర మీద సందడి చేసే అనేక టీవీ సీరియల్స్ ..కామెడీ షోస్ కి మళ్ళీ ఛానళ్ళు కొత్త ప్రొమోస్ వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే చాలా వరకు టీవీ సీరియల్స్ ..వాటి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటు మోస్ట్ పాపులర్ అయిన జబర్దస్త్ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ కూడా ప్రారంభమయ్యాయి.

 

ఇక సినిమా ఇండస్ట్రీలో పర్మిషన్ రాగానే అందరికంటే ముందు రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తో సెట్స్ కి వెళ్ళాలనుకుంటున్నారు. నల్గొండ కోట తో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతంలోను షూటింగ్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారట. అన్ని కుదిరితే ఎన్.టి.ఆర్, రాం చరణ్, అజయ్ దేవగన్ లతో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పటికే పూణే..గండిపేట్ లో చేయాలనుకొని డ్రాపయ్యారు. మరి ఇక్కడైనా చిత్రీకరణ జరపడం కుదురుతుందా లేదా చూడాలి.

 

జక్కన్న తో పాటు మిగతా నిర్మాతలు కూడా నెమ్మదిగా తమ సినిమాలని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేందుకు సన్నాహాలు చేస్తుండగానే ప్రముఖ నిర్మాత..కమెడియన్ బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్ అని వార్త వచ్చింది. దాంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కి పడింది. ఆ తర్వాత నెగిటివ్ వచ్చి బండ్ల గణేష్ రిపోర్ట్స్ తో సహా చూపిస్తూ ప్రకటించాడు. అయినా మళ్ళీ వరసగా బుల్లితెర నటులకి కరోనా పాజిటివ్ వస్తూ సినిమా వాళ్ళని ఆందోళనకి గురి చేస్తున్నాయి.

 

ప్రభాకర్, హరికృష్ణ అనే నటులకి.. తర్వాత నా పేరు meenakshi NAIDU' target='_blank' title='మీనాక్షి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మీనాక్షి సీరియల్ లో నటిస్తున్న నవ్య స్వామి తో పాటు తాజాగా అక్క మొగుడు , నెంబర్ 1 కోడలు , మౌన రాగం సీరియల్స్ లో నటిస్తున్న శివ కి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీలో టెన్షన్ వాతావరణం నెలకొందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: