గత ఏడాది మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్, ఆ సినిమాతో ఘోరంగా పరాజయాన్ని మూటగట్టుకున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో గ్రాండ్ లెవెల్లో తీసిన ఆ సినిమాలో చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటించగా, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఇక దాని అనంతరం ప్రస్తుతం మరొక స్టార్ నటుడు ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. రౌద్రం రణం రుధిరం పేరుతో ఎంతో భారీ లెవెల్లో తెరెక్కుతున్న ఈ పేట్రియాటిక్ మల్టీస్టారర్ మూవీలో రామ్ చరణ్, అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా ఎన్టీఆర్, కొమరం భీం పాత్ర పోషిస్తున్నారు.

ఇప్పటికే చరణ్ పాత్ర యొక్క ఇంట్రడక్షన్ వీడియో యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి స్పందన దక్కించుకోగా, ఈ నెల 22న ఎన్టీఆర్ కొమరం భీం ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఇటీవల ప్రారంభం అయింది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక దీనితో పాటు మరోవైపు తన తండ్రి చిరంజీవి హీరోగా కొరటాల శివ తీస్తున్న ఆచార్య మూవీలో ఒక చిన్న పాత్ర చేస్తున్న చరణ్, తన తదుపరి సినిమా విషయమై మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.

ఇక లేటెస్ట్ గా కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఇటీవల మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పిన ఒక స్టోరీ లైన్ ఎంతో నచ్చిన చరణ్, దాని పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమని, ఆర్ఆర్ఆర్ పూర్తి అయిన అనంతరం ఆ సినిమాని పట్టాలెక్కిద్దాం అంటూ మాటిచ్చినట్లు చెప్తున్నారు. కాగా ఒక అగ్ర నిర్మాణ సంస్థ ఈ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం గతంలో చరణ్, వంశీ ల కలయికలో వచ్చిన ఎవడు మాదిరిగా మరొక్కమారు వీరిద్దరి కాంబోలో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని ఆశించవచ్చు .....!!

మరింత సమాచారం తెలుసుకోండి: