ఎన్టీఆర్ కూడా యాభై లక్షలు ప్రకటించారు. విజయ్ దేవరకొండ రూ.10 లక్షలు, డైరక్టర్ త్రివిక్రమ్ రూ.10 లక్షలు, హారిక హాసిన సంస్ధ రూ.10 లక్షల అందించారు. అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ అయిదేసి లక్షల వంతున తమ సాయం ప్రకటించారు. వీరితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు సైతం ముందుకు వచ్చే అవకాశం ఉంది. అలానే లక్ష్మీ మంచు వరద ముంపు ప్రాంతాల్లోకి వెళ్లి ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నారు.
వరద బాధితులను ఆదుకోవడం కోసం తమిళనాడు ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర సీఎం కె.పళనిస్వామి రూ.10 కోట్ల విరాళం ప్రకటించడం విశేషం. దానికి సంబంధించిన చెక్కుని కూడా తెలంగాణా ప్రభుత్వానికి పంపించారు. అలానే బాధితుల కుటుంబాల కోసం దుప్పట్లు, బట్టలు పంపిస్తున్నామని చెప్పారు. అలానే ప్రముఖ పారిశ్రామిక సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది.
చిరంజీవి కోటి రూపాయలు, మహేష్ బాబు కోటి రూపాయలు, నాగార్జున 50 లక్షలు, జూ ఎన్టీఆర్ 50 లక్షలు, విజయ్ దేవరకొండ 10 లక్షలు, హారికా హాసిని క్రియేషన్స్ 10 లక్షలు, త్రివిక్రమ్ శ్రీనివాస్ 10 లక్షలు, అనీల్ రావిపూడి 5 లక్షలు, హరీష్ శంకర్ 5 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇలాంటి లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...