టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న పూజా హెగ్డే వరుసగా ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్ ల సినిమాలతో హిట్ లు కొట్టి ఇప్పుడు మరో టాప్ హీరో ప్రభాస్ సినిమా రాధే శ్యామ్ సినిమాలో నటిస్తోంది. ఈమెకు వరుస హిట్స్ తో డిమాండ్ పెరగడంతో నిర్మాతలు కూడా పూజా హెగ్డే అడిగినంత పారితోషకం సమర్పిస్తున్నారు. టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా మెరిసిపోతున్న పూజా హెగ్డేకి బాలీవుడ్ మాత్రం కలిసి రావడం లేదు. బాలీవుడ్‌లో అమ్మడు నటించిన సినిమాలన్నీ ఢమాల్ అంటూనే ఉన్నాయి. తెలుగులో దువ్వాడ జగన్నాధమ్ సినిమా చేసే ముందు హృతిక్ రోషన్‌తో కలిసి చేసిన ‘మొహంజదారో’ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.

ఇక ఇక్కడ దువ్వాడ జగన్నాధమ్ తో అమ్మడు సుడి తిరిగి తెలుగులో టాప్ హీరోయిన్ అయ్యింది. తెలుగు సినిమాలలో బిజీ అయినా బాలీవుడ్ మీద ఓ కన్నేసి ఉంచుతున్న పూజా హెగ్డేకి అక్కడ ఒక్క సినిమా కూడా కలిసి రాలేదనే చెప్పాలి. భారీ తారాగణంతో తెరకెక్కిన హౌస్ ఫుల్ 4 గత ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలా వచ్చి సరిగ్గా ఏడాది పూర్తీ అయింది. కామెడీ బేస్ మీద తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్.

అయితే సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నప్పటికీ డివైడ్ టాక్ వలన సినిమాకి కలెక్షన్స్ పడిపోవడంతో ఈ సినిమా కూడా ఆమె లిస్ట్‌లో ప్లాప్ మూవీగానే కౌంట్ పడింది. వెర్రి కామెడీతో తెరకెక్కిన ఈ సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేయలేకపోయారు. ఈ సినిమా రిలీజ్ అయి ఏడాది పూర్తయిన సందర్భంగా పూజ ట్వీట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయి ఏడాది అయిందని, సెట్ లో ఎంత కామెడీ పండిందో అదంతా సినిమాలో కనిపించిందని ఆమె పేర్కొంది. ఇక ఆమెకు మరో బాలీవుడ్ ఛాన్స్ ఒచ్చింది. రన్ వీర్ సింగ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో పూజా హీరోయిన్ గ ఎంపికయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: