మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రెండేళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ చిట్టిబాబు అనే చెవిటి వ్యక్తి గా నటించిన విషయం తెలిసిందే. కాగా సినిమాలో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు లభించాయి. ఇక దాని తర్వాత మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శీను దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన సినిమా వినయ విధేయ రామ. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఇక దాని తర్వాత చరణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మరో నటుడు ఎన్టీఆర్ తో కలిసి చరణ్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తి అయింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయిన చరణ్, రామరాజు పాత్ర అలానే ఎన్టీఆర్, కొమరం భీం పాత్రలకు ప్రేక్షకులు అలానే అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ దగ్గించుకొని సినిమాపై వారిలో భారీస్థాయిలో అంచనాలు ఏర్పరిచిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది  ద్వితీయార్ధం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇకపోతే దీని తర్వాత రామ్ చరణ్, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివల కలయికలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటించనున్నారు.

అయితే ఇప్పటివరకు చరణ్ మాత్రం తన తదుపరి సినిమా  ఎనౌన్స్ చేయకపోవడంతో ఆయన అభిమానులకు కొంత నిరాశ వ్యక్తం చేస్తూ ఓ వైపు తన బాబాయి అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ ఇటీవల వరుసగా సినిమాలు ఎంచుకుంటూ కొనసాగుతున్నారని అలానే మరోవైపు చిరంజీవి కూడా ఒక్కొక్కటిగా సినిమాలు చేసుకుంటూ సాగుతుండగా ఇటీవల అల్లు అర్జున్ కూడా ఒక దాని వెంట మరొకటి సినిమాలు పెంచుకుంటూ కొనసాగుతుంటే, ఆ ఫ్యామిలీలో ఒక్క చరణ్ మాత్రమే అందరికంటే ఎంత స్లోగా సినిమాలు ఎంచుకుంటూ సాగుతున్నాడని, ఇలా అయితే కుదరదు ఇకపై రాబోయే రోజుల్లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ ఆయన కొనసాగాలని కోరుకుంటూ పలువురు ఆయన అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: