కానీ ఈ సారి ఆయన దర్శకత్వం వహించరట.. ఈ సారి ఆయన హీరోగా నటిస్తున్నారు. ఈ వార్త వింటేనే ఆశ్చర్యానికి గురవుతున్నారు కదా. అవును.. రాఘవేంద్రరావు హీరోగా మారుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఆయనకు జోడీగా నటి రాశీ ఖన్నా నటిస్తోందట. ఆమెతో కలిపి మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తున్నట్టు టాక్. ఈ సినిమాకు ఆయన సొంత బ్యానర్ అయిన ఆర్కా మీడియా వర్క్స్ ప్రొడ్యూస్ చేస్తోందట. మరి ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు వహిస్తున్నారనేగా మీ డౌట్. సీనియర్ నటుడు తనికెళ్ల భరణి ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను తీసుకుంటున్నారట.
తనికెళ్ల భరణి గతంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో మిథునం సినిమాను తీసిని విషయం తెలిసిందే. ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు కూడా రాఘవేంద్రరావుతో ఆ తరహా సినిమానే తనికెళ్ల భరణి తీయబోతున్నారా అన్నది కూడా చర్చ సాగుతోంది. అయితే ఈ సినిమాలో రాశీ ఖన్నా వంటి యంగ్ హీరోయిన్లు నటిస్తుండటంతో ఈ చిత్ర కథ అసలు ఏ విధంగా ఉండనుందోనని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.