విజయ్ తర్వాతి చిత్రం సుకుమార్తోనే ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా అంటే ఓ రేంజ్లో ఉంటుందని, బొమ్మ అద్దిరిపోద్ది అని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం తాజాగా వినిపిస్తున్న వార్తలు వింటుంటే ఇది నిజమే అనిపిస్తోంది. సుకుమార్, విజయ్ కాంబోలో భారీ మూవీకి ప్లాన్ చేస్తున్నారట. ఇది ఓ పీరియాడికల్ చిత్రమని టాక్ వినిపిస్తోంది.
కాగా.. ఈ సినిమా నేపథ్యం గురించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే.. ఈ సినిమా ఇండియా - పాకిస్తాన్ విడిపోయిన కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కనుందట. హై ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తారని సమాచారం. దేశం విడిపోయిన సమయంలో పాకిస్తాన్ - ఇండియా మధ్య జరిగిన యుద్ధం ఈ సినిమాలో కీలకమైన ఘట్టమట. అప్పటి వార్ లో ఇండియా గెలుపు కోసం ఒక జవాన్ ఎంత గొప్పగా పోరాటం చేశాడనే కోణంలో ఈ సినిమా ఉంటుందని టాక్. ఆ జవాన్ పాత్రలోనే మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడట.
పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్న ఈ మూవీ దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుందట. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘పుష్ప’. ఈ సినిమా పూర్తవ్వగానే విజయ్ సినిమా మొదలుకానుందని సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా.. కేదార్ సెలగం శెట్టి అనే యువ నిర్మాత ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు.