ఇక బాహుబలి సినిమాలో అనుష్క కు మరింత క్రేజ్ పెరిగిపోయింది అనే విషయం తెలిసిందే. ఇక సమంత విషయానికి వస్తే ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే ఎంతోమంది ప్రేక్షకులను తన బుట్టలో వేసుకుంది. ఆ తర్వాత అక్కినేని వారసుడు ని పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలు గా మారిపోయింది. ఇక ప్రస్తుతం తన నటన తో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు సంపాదించుకుని స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోంది. అయితే ఈ ఇద్దరు హీరోయిన్లకు ఈ మధ్య కాలంలో మాత్రం హీరోల సరసన నటించే అవకాశాలు రావట్లేదు.
అయితే దీని వెనుక పెద్ద కారణమే ఉందని ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. సమంత అనుష్క సరసన నటించడానికి అగ్ర హీరోలే కాదు మీడియం రేంజ్ హీరోలు కూడా ఆసక్తి చూపడం లేదట. ఒకవేళ సినిమాలో అనుష్క లేదా సమంత నటించారు అంటే సినిమా మొత్తం వారే హీరోలను డామినేట్ చేస్తారని.. నటనలో, గ్లామర్ లో కూడా వారే ప్రేక్షకులకు కనిపిస్తారని అందుకే హీరోలకు పెద్దగా స్కోప్ కనిపించే అవకాశం లేదు కాబట్టి ఇక వీరిని సినిమాలలో పెట్టుకునేందుకు భయపడిపోతున్నారట. ఇటీవలే నిశ్శబ్దం సినిమాను అనుష్క సినిమా అన్నారు కానీ మాధవన్ సినిమా అనలేదు.. ఇక సమంత నటించిన ఓ బేబీ సినిమాలో నాగ సూర్య నటించిన సమంత సినిమా అన్నారు. ఇక అంతేకాకుండా జాను సినిమాలో కూడా సమంత కే పేరు వచ్చింది. అందుకే హీరోలు వీరిని తమ సినిమాల్లో పెట్టుకోవడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు.