ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అనుష్క శెట్టి, అక్కినేని సమంత కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ ఇద్దరికీ ఉన్న క్రేజ్ మాత్రం ప్రత్యేకం అనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది అనుష్క.  తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి తన గ్లామర్ తో అందరినీ తనవైపుకు తిప్పుకుంది అనుష్క. కేవలం గ్లామర్ తో మాత్రమే కాదు తన నటనతో కూడా అందరిని మెప్పించింది.



 ఇక బాహుబలి సినిమాలో అనుష్క కు మరింత క్రేజ్ పెరిగిపోయింది అనే విషయం తెలిసిందే. ఇక సమంత విషయానికి వస్తే ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే ఎంతోమంది ప్రేక్షకులను తన బుట్టలో వేసుకుంది.  ఆ తర్వాత అక్కినేని వారసుడు ని పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలు గా మారిపోయింది. ఇక ప్రస్తుతం తన నటన తో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు సంపాదించుకుని స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోంది. అయితే ఈ ఇద్దరు హీరోయిన్లకు ఈ మధ్య కాలంలో మాత్రం హీరోల సరసన నటించే అవకాశాలు రావట్లేదు.



 అయితే దీని వెనుక పెద్ద కారణమే ఉందని ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. సమంత అనుష్క సరసన నటించడానికి అగ్ర హీరోలే కాదు మీడియం రేంజ్ హీరోలు కూడా ఆసక్తి చూపడం లేదట. ఒకవేళ సినిమాలో అనుష్క లేదా సమంత నటించారు అంటే సినిమా మొత్తం వారే హీరోలను డామినేట్ చేస్తారని.. నటనలో, గ్లామర్ లో కూడా వారే ప్రేక్షకులకు కనిపిస్తారని అందుకే హీరోలకు పెద్దగా స్కోప్ కనిపించే అవకాశం లేదు కాబట్టి ఇక వీరిని సినిమాలలో పెట్టుకునేందుకు భయపడిపోతున్నారట.  ఇటీవలే నిశ్శబ్దం సినిమాను అనుష్క సినిమా అన్నారు కానీ మాధవన్ సినిమా అనలేదు.. ఇక సమంత నటించిన ఓ బేబీ సినిమాలో  నాగ సూర్య నటించిన సమంత సినిమా అన్నారు. ఇక అంతేకాకుండా జాను సినిమాలో కూడా సమంత కే  పేరు వచ్చింది.  అందుకే హీరోలు వీరిని తమ సినిమాల్లో పెట్టుకోవడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: