టాలీవుడ్ సినిమా పరిశ్రమకి దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆర్య మూవీ ద్వారా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సుకుమార్, ఆ మూవీతో సూపర్ హిట్ అందుకుని తొలి మూవీతోనే టాలీవుడ్ ఆడియన్స్ లో తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తరువాత ఆయన తీసిన జగడం, ఆర్య 2 మూవీస్ పెద్దగా సక్సెస్ కానప్పటికీ సుకుమార్ వే ఆఫ్ మేకింగ్ కి మంచి పేరు దక్కింది. అనంతరం 100% లవ్ మూవీ తో సూపర్ హిట్ కొట్టిన సుకుమార్, అపై ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తో వన్ నేనొక్కడినే మూవీ తీసే ఛాన్స్ దక్కించుకున్నారు. అయితే ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర పరాజయంగా నిలిచింది.

అయితే అప్పటి నుండి మరొక్కసారి మహేష్, సుకుమార్ ల కలయికలో మరొక సినిమా వస్తే చూడాలని సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు పలువురు ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఇటీవల ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ వీరిద్దరితో కలిసి ఒక సినిమా చేయాలని డిసైడ్ అయింది, అయితే సుకుమార్ చెప్పిన కథ పెద్దగా నచ్చకపోవడంతో కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ ల వలన సినిమా చేయలేకపోతున్నట్లు స్వయంగా మహేష్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలిపారు. ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో సూపర్ స్టార్, సుకుమార్ కాంబోలో ఒక బ్లాక్ బస్టర్ మూవీ రానున్నట్లు చెప్తున్నారు. 

ప్రస్తుతం పుష్ప మూవీ చేస్తున్న సుకుమార్, ఆపై విజయ్ దేవరకొండ తో ఒక మూవీ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే దాని తరువాత సుకుమార్ మహేష్ తో నే ఒక సినిమా చేయనున్నారని, ఇటీవల మహేష్ కు మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ స్టోరీ ని ఆయన వినిపించారని, అది ఎంతో నచ్చిన మహేష్, తన ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తి అయిన అనంతరం చేద్దాం అని మాటిచ్చినట్లు టాక్. అయితే ఈ మూవీ మాత్రం వన్ మూవీ మాదిరిగా కాకుండా సూపర్ హిట్ ఫార్ములాతో తెరకెక్కనుందని, అతి త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: