తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఒకరు రష్మిక మందన్నా. ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్ ఫాలొయింగ్ ఎక్కువే అని చెప్పుకోవచ్చు. క్షణం తీరిక లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉంటున్నారు. కానీ, ఈ బ్యూటీ అభిమానులు మాత్రం.. షీ సో క్యూట్.. షీ సో స్వీట్.. షీ సో బ్యూటిఫుల్ అంటూ జపం చేస్తున్నారు. హీరో ధృవ్ సర్జాతో కలిసి నటించిన పొగరు సినిమా ఇటీవలే విడుదల అయింది. సినిమా పోస్టర్లను గోడలపై అతికించడం తెలిసే ఉంటుంది. ఈ క్రమంలో ఓ అభిమాని సినిమా పోస్టర్లో ఉన్న రష్మికను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించాడు. రష్మిక ఫోటో జడలో మల్లెపూలు పెట్టాడు. అలా పూలు పెడుతున్న వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పోస్టర్లో రష్మిక జడకు పూలు అతికించిన అభిమాని నిర్వాకానికి నెటిజన్లు అబ్బురపడుతున్నారు. మరీ ఇంత అభిమానమా? అని ఆశ్చర్యపడుతున్నారు. కాగా రష్మిక పొగరు సినిమా కన్నడంతో పాటు తెలుగులోనూ విడుదల అయింది. నందన్ కిషోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న రిలీజ్ అయింది. ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ను దక్కించుకుంది.
కిరాక్ పార్టీ సినిమాతో వెండితెరకు హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అల్లు అర్జున్తో పుష్ప, శర్వానంద్తో ఆడాళ్లు మీకు జోహార్లు, తమిళంలో కార్తీతో సుల్తాన్, హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్ను, అమితాబ్ బచ్చన్తో డాడీ సినిమాల్లో నటిస్తున్నారు. హిందీలో కూడా మందన్నాకు సినిమా ఆఫర్లు వస్తుండటంతో ఆమె ప్రస్తుతం ఎంతో బిజీగా ఉంటున్నారు.