సూపర్ స్టార్ మహేష్ తో పరశురామ్ తీస్తున్న లేటెస్ట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ సర్కారు వారి పాట ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ దీనికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక గత ఏడాది మహేష్ జన్మదినం సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక త్వరలో సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ వారు నిర్మించనున్న భారీ ప్రతిష్టాత్మక సినిమాలో కూడా మహేష్ యాక్ట్ చేయనున్నారు. మంచి యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించే విధంగా దర్శకుడు త్రివిక్రమ్మూవీ స్టోరీ రాసుకున్నట్లు టాక్. కాగా ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ ఎంతో అద్భుతంగా ఉంటుందని, అలానే ఈ మూవీలో ప్రధానమైన వదిన పాత్రకు గాను ఇప్పటికే పలువురు నటీమణులను పరిశీలించిన దర్శకుడు త్రివిక్రమ్, ఫైనల్ గా లయ ని ఎంపిక చేసినట్లు టాక్.

కొన్నేళ్ల క్రితం వేణు సరసన హీరోయిన్ గా స్వయంవరం మూవీతో టాలీవుడ్ కి పరిచయమైన లయ, అక్కడి నుండి వరుసగా చాలా సినిమాలు చేసారు. ఇక కొన్నేళ్ల క్రితం వివాహం అనంతరం పూర్తిగా సినిమాలకు దూరమైన లయ ఇటీవల రవితేజ, ఇలియానా నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చారు. అయితే మహేష్ తో చేయబోయే సినిమాలో త్రివిక్రమ్ తనకు వినిపించిన పాత్ర ఎంతో నచ్చడంతో ఆమె నటించడానికి ఒప్పుకున్నారని సమాచారం. అలానే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు అతి త్వరలో అధికారికంగా వెల్లడికానున్నట్లు టాక్. కాగా ఈ మూవి షూట్ ని త్వరలో ఆరంభించి వచ్చే ఏడాది సమ్మర్ కి దీనిని విడుదల చేయనున్నారు..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: