టాలీవుడ్ స్టార్
హీరో విజయ్ దేవరకొండ తాజాగా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి కూడా ఎంటరైన విషయం తెలిసిందే. ఇప్పటికే రౌడీ వేర్ అనే బ్రాండ్ తో క్లోతింగ్ బిజినెస్ చేస్తున్న
విజయ్ దేవరకొండ ఇప్పుడు ఈ మల్టీ ప్లేక్స్ బిజినెస్ లోకి రావడం ఆయన అభిమానులను ఎంతగానో సంతోషానికి గురిచేస్తుంది.
లవ్ స్టోరీ సినిమా తో ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ ను ప్రారంభించగా అక్కినేని
నాగచైతన్య హీరో సినిమానే ఈ మల్టీ ప్లక్స్ లో మొదట గా పడడం విశేషం. నిజానికి వకీల్ సాబ్ సినిమాతోనే మల్టీప్లెక్స్ బిజినెస్ ను ప్రారంభించాలని
విజయ్ దేవరకొండ భావించగా అప్పటికి
థియేటర్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో దాన్ని పోస్ట్ చేయవలసి వచ్చింది.
ధియేటర్ బిజినెస్ లలో ఎక్కువ థియేటర్లు కలిగివున్న ఏషియన్ సంస్థవారు ఈ మల్టీప్లెక్స్ నిర్మాణంలో భాగస్వామ్యం కాగా వారు నిర్మిస్తున్న
లవ్ స్టోరీ సినిమా ఇందులో మొదట గా విడుదల అవుతుండటం విశేషం. ఇక పోతే రాష్ట్రంలోని ఏ థియేటర్లకు లేని ఫీచర్లు సవలతులు ఈ ధియేటర్ కి ఉన్నట్లు తెలుస్తుంది. మంచి స్క్రీన్ తో పాటు సీటింగ్ కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందట. దేశంలోనే వినూత్నమైన ఖరీదైన తెరను ఈ మల్టీప్లెక్స్
థియేటర్ కలిగి ఉంటుందట.
ఇకపోతే
దేవరకొండ అభిమానులు లైగర్
సినిమా ను ఈ థియేటర్లో చూడడానికి ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
మహబూబ్ నగర్ లో ఈ
సినిమా ధియేటర్ ని నిర్మించగా తొందరలోనే అన్ని ముఖ్యమైన పట్టణాలలో దీన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు
విజయ్ దేవరకొండ. ఇక
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్
సినిమా తర్వాత
సుకుమార్ దర్శకత్వంలో ఓ
సినిమా చేయనున్నాడు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా
సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి నటుడిగా హీరోగా నిలదొక్కుకుని ఇప్పుడు పాన్
ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ నేపథ్యంలోనే ఇతర బిజినెస్ లలో కూడా పెట్టుబడులు పెడుతూ రెండు చేతులు బాగా సంపాదిస్తున్నాడు. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి బిజినెస్ లలోకి ఆయన ఎంటర్ అవుతాడో చూడాలి.