మలయాళ ముద్దుగుమ్మ సాయి పల్లవికి తెలుగునాట ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తెలుగులో ఒక్క సినిమా చేయకముందే కోట్ల మంది అభిమానులను ఆమె కలిగి ఉంది. తెలుగులోకి వచ్చే సినిమాలు చేసిన తర్వాత ఆ అభిమానుల సంఖ్య రెట్టింపు అయ్యింది. ఐదారు సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అగ్ర హీరోయిన్ గా ఉంది అని చెప్పవచ్చు. అయితే ఆమె హీరోయిన్ గా చేసిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం తర్వాత తెలుగులో ఒక్క సినిమాను కూడా ఒప్పుకోలేదు.

కారణం ఏంటో తెలియదు కానీ ఇది ఆమె అభిమానులను ఎంతగానో నిరాశపరిచే విషయం అని చెప్పాలి. ఎంతో డిమాండ్ ఉన్న సాయి పల్లవికి ఒక్క సినిమా కూడా చేతిలో లేకపోవడం ఏంటి అని ఆశ్చర్య పోవడం వారి వంతు అవుతుంది. వాస్తవానికి ఇలాంటి నటి తెలుగు సినిమా పరిశ్రమలో ఎవరూ లేరనే చెప్పాలి. పోనీ ఇతర భాషలలో కూడా మంచి క్రేజ్ ఉన్న ఈ హీరోయిన్ అక్కడ నటిస్తుందా అంటే లేదు. ఓవరాల్ గా అన్ని సినిమా పరిశ్రమలలో ఆమె సినిమాలు చేయడం మానేసింది. 

గార్గి అనే ఓ సినిమాతో ఈమధ్యే ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఆ సినిమా సో సో గా ఉండడంతో ఈమెకు పెద్దగా పేరు రాలేదని చెప్పాలి. ఇది కూడా ఎప్పుడో నటించిన సినిమా. ఇప్పుడు విడుదల అయింది. కొత్తగా ఆమె నటించే సినిమా ఏ ఒక్కటి కూడా సెట్స్ మీద లేకపోవడంతో ఈమె ఎప్పుడు నటిస్తుందా అని ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఆమెను ఏ విషయం నటించకుండా ఆపుతుందో తెలియదు కానీ త్వరగా ఆమె సినిమాలు చేయాలని డిమాండ్ ఇప్పుడు ఎక్కువైపోతుంది. తెలుగులో హీరోయిన్ గా మారి పెద్ద హీరోల సరసన కూడా నటిస్తుందని అందరూ భావించారు. కానీ ఈమె మీడియం రేంజ్ హీరోలతో మాత్రమే నటిస్తూ ఉండటం అందరినీ నిరాశ పరుస్తుంది. 
.

మరింత సమాచారం తెలుసుకోండి: