టాలీవుడ్ లో బిగ్గెస్ట్ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దం కాబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’, మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురంలో’, రాంచరణ్-ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’, వెంకటేష-చైతూ ‘వెంకిమామ’, నాని ‘గ్యాంగ్ లీడర్’ ఇలా పెద్ద సినిమాలతో టాలీవుడ్ కల కలలాడబోతుంది. ఖైదీ నెంబర్ 150 సినిమాతో పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా కమర్షియల్ హిట్ అయ్యింది..దాంతో పాటే మంచి మెసేజ్ కూడా ఇచ్చారు.
మెగాస్టార్ స్థాయిని పెంచే విధంగా ఈ మూవీ రూపొందించారు దర్శకులు వివివినాయక్. ఈ సినిమా హిట్ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’లో నటిస్తున్నారు చిరంజీవి. మొట్టమొదటి తెలుగు బిడ్డ, బ్రిటీష్ వారిని ముప్పతిప్పలు పెట్టి స్వతంత్ర సంగ్రామంలో తనదైన ముద్ర వేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. రాంచరణ్ ఈ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్, చిన్న టీజర్ రిలీజ్ చేశారు. నిన్న ఈ మూవీ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. తాజాగా రుకి సంబంధించిన లుక్ ఒకటి విడుదల చేశారు.
ఇందులో చిరు విల్లు ఎక్కుపెడుతూ వీరావేశంతో కనిపిస్తున్నారు. ఈ సినిమా టీజర్ని ఆగస్ట్ 20న విడుదల చేయనున్నారు.కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి టాప్ స్టార్స్ నటిస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మూవీ విడుదల కానుందనే టాక్ వినిపిస్తుంది. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలతో పాటు డీఐ వర్క్ జరపుకుంటుంది.